కేవలం మా 23మంది టీడీపీ ఎమ్మెల్యేలను చూసి జగన్ భయపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరులపై సస్పెన్షన్ వేటు వేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ
జగన్ కనుసన్నల్లోనే స్పీకర్ పనిచేస్తున్నారని ఆరోపించారు.
కడప ఫ్యాక్షన్ రాజకీయాలను ఇక్కడకు తీసుకురావద్దన్నారు. ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మాట తప్పను.. మడప తిప్పను అన్న సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కనుసన్నల్లో స్పీకర్ ఉన్నారన్నారాని గోరంట్ల
ఆరోపించారు.