telugu navyamedia
వ్యాపార వార్తలు

గుడ్‌న్యూస్‌: భారీగా త‌గ్గిన పుత్త‌డి ధ‌ర‌లు…

 

మ‌హిళ‌ల‌కు శ్రావ‌ణ‌మాసంలో ఇది ఒక గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.. భారీగా త‌గ్గిన ఈ రోజు బంగారం ధ‌ర‌లు..మ‌న‌ దేశంలో అధికంగా అమ్ముడుపోయే వాటిల్లో బంగారం కూడా ఒక‌టి. ఇంట్లో ఎలాంటి శుభ‌కార్యం జ‌రిగినా బంగారం కొనుగోలు చేయాల్సిందే. బంగారం త‌గ్గిన‌ప్ప‌డు కొన‌డం అవ‌స‌ర‌మైన‌ప్ప‌డు పెట్టుబడిగా వినియోగిస్తున్నారు. గ‌త కొంత కాలంగా పుత్త‌డి ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో ఇబ్బందులు ప‌డ్డారు. అయితే, తాజాగా మార్కెట్లు తిరిగి పుంజుకోవ‌డంతో ధ‌ర‌లు దిగివ‌స్తున్నాయి.

ప్ర‌స్తుతం దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి .. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 760 త‌గ్గి 43,840కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 830 త‌గ్గి రూ.47,830కి చేరింది. బంగారంతో పాటు వెండి ధ‌ర‌లు కూడా దిగివచ్చాయి. కిలో వెండి ధ‌ర రూ.1500 త‌గ్గి 70,200కి చేరింది.

అలాగే విశాఖ‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ 490 త‌గ్గి. 43,350 చేరింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 530 త‌గ్గి రూ.47,300 కి చేరింది. అయితే బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇదే మంచి అవ‌కాశంగా చెప్పుకోవాలి. దేశంలోని బంగారం డిమాండ్ గత కొన్ని సంవత్సరాలలో గణనీయంగా పెరిగిని విష‌యం తెలిసిందే..!

Related posts