telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వర్ల రామయ్య భద్రత తొలగింపుపై.. ఏపీ డీజీపీకీ చంద్రబాబు లేఖ

chandrababu

టీడీసీ నేత వర్ల రామయ్యకు వన్ ప్లస్ వన్ భద్రత తొలగింపుపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వర్ల రామయ్య ప్రజా సేవకు కట్టుబడి ఉన్న సీనియర్ నాయకుడని చంద్రబాబు అందులో పేర్కొన్నారు. ఆయనకు భద్రత పునరుద్ధరించాలని లేఖలో కోరారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను మీడియా ముందు నిలదీసే ముఖ్య ప్రతినిధి వర్ల రామయ్యని తెలిపారు. ఆయన రాజకీయ నేతగానే కాకుండా మాజీ పోలీసు అధికారి అని కూడా గుర్తు చేశారు.

ఎస్టీఎఫ్, ఉగ్రవాద వ్యతిరేక శాఖలోనూ ఆయన పనిచేశారని చెప్పారు. ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం వన్ ప్లస్ వన్ భద్రతను పదేళ్ల పాటు కొనసాగించిందని గుర్తు చేశారు.ఏపీలో హింస, బెదిరింపులతో కొనసాగుతోన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన భద్రత గురించి తాము ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు.

Related posts