యువత సోషల్ మీడియా ఊబిలో చిక్కుకోవద్దని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్ధిపడగ తండాలో డబుల్ బెడ్రూం ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ.. . డబుల్ బెడ్రూం ఇండ్లు నిరుపేదలకు నిలువెత్తు గౌరవం అని దేశంలో మరెక్కడా ఇలాంటి ఇండ్లను నిర్మించి ఇవ్వడం లేదు. అన్ని వసతులతో ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు.
అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు కూడా ఇండ్లు కట్టించి ఇస్తామని పేర్కొన్నారు. యువత సమయాన్ని కూడా వృథా చేయడం మంచిది కాదు. కష్టపడి పని చేయాలనుకుంటే అనేక అవకాశాలున్నాయి. యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.