తెలంగాణలో మరో దారుణం చోటు చేసుకుంది. తాజాగా ఓ జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజిపేటలో బుధవారం చోటు చేసుకుంది. మంగలి జగన్ (26) గతేడాది మిన్పూర్ గ్రామానికి జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా బదిలీపై వెళ్లారు. తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఒకవైపు జీతం రాక, మరోవైపు తాను చేసిన పనులకు సంబంధించి డబ్బులు చెల్లించి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో తాను పనిచేసిన నాదులాపూర్ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. తనకు తానుగానే మిన్పూర్ గ్రామ పంచాయతీకి వస్తే ప్రజాప్రతినిధులు, అధికారులు తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించాడు. ఆ వేధింపులు తట్టుకోలేకఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు లేఖలో జగన్ పేర్కొన్నాడు. అయితే.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.