పాకిస్థాన్ పార్లమెంట్లో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ మండిపడ్డారు. ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో ఓవైసీ ముఖ్య ఆతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…టిప్పు సుల్తాన్ హిందువులకు శత్రువు కాదని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ అణుబాంబుల గురించి మాట్లాడుతున్నారని.. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.
పాకిస్థాన్లో ఉన్న లష్కరే, జైషే ఉగ్రవాద సంస్థలను నియంత్రించాలని సూచించారు. అసెంబ్లీ సమావేశంలో పాక్ ప్రధాని టిప్పు సుల్తాన్, బహదుర్ షా జాఫర్ల పేర్లు ప్రస్తావించడాన్ని ఆయన ఖండించారు. టిప్పు సుల్తాన్ హిందువులకు వ్యతిరేకం కాదన్నారు. అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ అణు బాంబుల గురించి మాట్లాడటాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘బాంబులు మీ వద్దే కాదు మా దేశంలో కూడా ఉన్నాయి’’ అంటూ హెచ్చరించారు.