telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నాడు భూములు ఇవ్వొద్దని వైసీపీ నేతలు రెచ్చగొట్టారు: చంద్రబాబు

tdp chandrababu

నాడు రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇవ్వొద్దని వైసీపీ నేతలు రెచ్చగొట్టారని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. రెచ్చగొట్టినా తొంభై తొమ్మిది శాతం మంది రైతులు భూములు ఇచ్చారని అన్నారు. పర్యావరణం, ఆర్థిక, సామాజిక రంగాలపై ప్రభావం ఉంటుందంటూ దుష్ప్రచారం చేస్తూ ప్రపంచ బ్యాంకుకు వైసీపీ లేఖలు రాసిందినని విమర్శించారు.

రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై చందబాబు మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు వెనక్కి వెళ్లిపోవడానికి పూర్తి కారణం వైసీపీ నేతలే అని విమర్శించారు. వైసీపీపై ఉన్న అవినీతి ముద్రను టీడీపీపై రుద్దే యత్నం చేశారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఏపీకి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. అమరావతిలో ముళ్ల కంపలు తప్ప ఇంకేం లేవని మంత్రులే చెప్పడం దారుణమని అన్నారు. వైసీపీ కారణంగా అమరావతిలో భూముల విలువ బాగా పడిపోయిందని విమర్శించారు. ఈ క్రమంలో భూములున్న రైతులు ఆందోళన చెందుతున్నారని బాబు పేర్కొన్నారు.

Related posts