తెలంగాణలో ఈ నెల 21న హుజూర్నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసేందుకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గానికి టీడీపీ తరఫున చావా కిరణ్మయి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
తెలుగుదేశం పరిస్థితిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద కుమార్ గౌడ్ లతో పాటు రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు చంద్రబాబుతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా బలయ్య పర్యటన, ప్రచారం గురించి కూడా చర్చ సాగింది. ఈ నెల 13వ తేదీ ఆదివారం నుంచి బాలకృష్ణ పర్యటన సాగుతుందని, ఐదు నుంచి ఆరు రోజులు ఆయన ప్రచారం చేస్తారని తెలుస్తోంది.