telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ

Akbaruddin mim

తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ ల పై చర్చ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల అన్ని రంగాలు కుదేలవుతున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు టైంలో పూర్తి చేసినటీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం పైసా ఇవ్వలేదని అన్నారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ పథకం వల్లే పేద ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

Related posts