బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీబీఐ ఇన్వెస్టిగేషన్లో రియాను నిందితురాలుగా చేర్చి విచారణ జరుపుతున్నారు. అయితే రియా బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకుంది. కానీ కోర్టు రియాకు బెయిల్ నిరాకరించి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆమె బైకుల్లా జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో ఓ కళాకారుడు సుశాంత్ మైనపు విగ్రహాన్ని రూపొందించగా అందుకు సంబంధించిన వీడియోను సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ చూసింది. ఈ వీడియోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో భావోద్వేగభరిత పోస్ట్ చేసింది. ‘ఈ విగ్రహం చూస్తుంటే మా అన్నయ్య తిరిగొచ్చినట్లుంది’ అని ఆమె పేర్కొంది. ఈ విగ్రహాన్ని రూపొందించిన కళాకారుడు సుశాంత రాయ్ కి ఆమె ధన్యవాదాలు తెలిపింది. కాగా ఈ విగ్రహాన్ని త్వరలోనే ఓ మ్యూజియంలో పెట్టనున్నారు. దీన్ని నెలన్నరపాటు కష్టపడి తయారు చేశారు. సుశాంత రాయ్ వయసు 64 సంవత్సరాలు. ఈ విగ్రహాన్ని చూడడానికి ఇప్పుడు సుశాంత్ లేకపోవడం విచారకరం అని ఆయన అన్నారు.
Felt as if Bhai came Alive! Thank You! 🙏❤️🙏 #Message4SSR pic.twitter.com/ZyuZDqGyOm
— Shweta Singh Kirti (@shwetasinghkirt) September 20, 2020