telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో సారా అలీఖాన్‌, శ్రద్దాకపూర్ ఎన్‌సీబీ నోటీసులు ?

sara

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ఇక తాజాగా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు విచారణలో భాగంగా సారా అలీఖాన్‌, శ్రద్దాకపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లకు ఎన్‌సీబీ సమన్లు ఇవ్వనుంది. ఈ వారంలోనే ఎన్‌సీబీ వీరికి సమన్లు ఇచ్చే అవకాశం ఉంది. కాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో‌ అధికారులు విచారించగా బాలీవుడ్‌లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురు సారా అలీ ఖాన్‌, శ్రద్ధాకపూర్‌, సిమోన్‌ ఖంబట్టా పేర్లను కూడా రియా విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కారణంగా రకుల్ ప్రీత్‌ సింగ్‌ పేరును బయటకు వెల్లడించడానికి ఎన్‌సీబీ నిరాకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో బాలీవుడ్‌ సెలబ్రిటీలకు ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 67 ప్రకారం త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు సుశాంత్ అనుమానాస్పదంగా మేయుతి చెంది మూడు నెలలు గడుస్తున్నా కేసు ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం.

Related posts