బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై సీనియర్ హీరోయిన్ భూమిక చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది. `ధోనీ` సినిమాలో సుశాంత్కు భూమిక అక్కగా నటించిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతి గురించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భూమిక ఓ భావోద్వేగ పోస్ట్ చేసింది. “డియర్ సుశాంత్.. నువ్వు మమ్మల్ని విడిచి వెళ్లిపోయి వారం దాటింది. నువ్వు ఎక్కడున్నా ఆ దేవుడి చేతుల్లో భద్రంగా ఉంటావని నమ్ముతున్నా. ఎందువల్ల నువ్వు మాకు దూరమయ్యావు?.. ఆ రహస్యం నీతోనే వెళ్లిపోయింది. నీతోపాటు మట్టిలో కలిసిపోయింది. సుశాంత్ మరణంపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. `చిత్రపరిశ్రమ వల్ల ఇలా జరిగిందా`, `బంధాలే దీనికి కారణమా`.. ఇలా ఎంతో చర్చ జరుగుతోంది. అందరికీ నేను ఒకటే చెప్పదలచుకున్నా. దయచేసి చనిపోయిన వారి ఆత్మకు గౌరవం ఇవ్వండి. పాజిటివ్గా ఉండండి. విమర్శలు ఆపి ఎదుటి వ్యక్తులను జాగ్రత్తగా చూసుకోండి. వ్యాయామం చేయండి” అంటూ భూమిక పేర్కొంది.
previous post