వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని…విజయశాంతి, కేసీఆర్ ఇక్కడి వాళ్లేనా? అని షర్మిల ప్రశ్నించారు. జయలలిత కూడా తమిళనాడు వాసి కాదని..తాను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనేనని షర్మిల స్పష్టం చేసింది. పార్టీ వేరు.. ప్రాంతం వేరైనా.. అన్నాచెల్లెళ్లుగా మేం ఒక్కటేనని.. దేవుడి దయతో తెలంగాణ వచ్చిందని తెలిపారు. తెలంగాణ వచ్చాక ప్రజల సమస్యలు తీరాయా? అమరవీరుల ఆశయాలు నెరవేరాయా? అని షర్మిల ప్రశ్నించారు. ఉద్యమంలో తాను లేనంత మాత్రాన.. తెలంగాణపై ప్రేమ ఉండదా? అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ వాళ్ల గడపకు వెళ్లి వస్తానని షర్మిల పేర్కొన్నారు. త్వరలోనే తన పార్టీ ప్రకటన ఉంటుందని.. రైతుల సమస్యలపై ఢిల్లీకి వెళ్తానని ఆమె చెప్పారు. తనకు పదవి ఎందుకు ఇవ్వలేదో సీఎం జగన్నే అడగండని అన్ని పార్టీలకు హితువు పలికారు.
previous post
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి .. తన దగ్గర ఓ మెడిసిన్ ఉంది: జగ్గారెడ్డి