telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ కు విలన్ గా కోలీవుడ్ స్టార్ ?

SVP

పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుకి విలన్ గా ఎవరు నటించనున్నారు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ముందుగా కన్నడ నటుడు కిచ్చా సుదీప్ ని అనుకున్నారు కానీ అతని డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో సినిమా నుంచి తప్పుకున్నాడు.. ఆ తరవాత బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ని తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు కొత్తగా కోలీవుడ్ స్టార్ హీరో అరవింద్ స్వామి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాలో తన పాత్ర బాగా నచ్చి అరవింద్ స్వామి డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే అరవింద్ స్వామి రామ్ చరణ్ హీరోగా వచ్చిన ధ్రువ సినిమాలో విలన్ గా నటించి స్టైలిష్ విలన్ గా పేరు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ కి అక్కగా విద్యాబాలన్ నటిస్తోందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది

Related posts