వెస్టిండీస్ సిరీస్ లో భాగంగా ఫ్లోరిడాలోని లాడర్ హిల్ లో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్ లోనూ టీమిండియానే టాస్ నెగ్గింది. టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ ఈసారి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, మూడు మ్యాచ్ సిరీస్ లో తొలి పోరు నెగ్గిన టీమిండియా 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో టి20కి టీమిండియాలో ఎలాంటి మార్పుల్లేవు.
విండీస్ టీమ్ మాత్రం ఒక మార్పుతో బరిలో దిగుతోంది. ఓపెనర్ జాన్ క్యాంప్ బెల్ స్థానంలో ఖారీ పియర్రీ తుదిజట్టులోకి వచ్చాడు. సునీల్ నరైన్ ను ఓపెనర్ గా బరిలో దించాలని విండీస్ టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. మొదటి టీ20లో భారత్ సునాయాసంగా గెలిచిన విషయం తెలిసిందే. మరొకటి గెలిస్తే పొట్టి సిరీస్ కైవసం అయినట్టే.
ఏడుకొండలు మినహా అంతటా వైసీపీ రంగులే: పవన్ కళ్యాణ్