telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

1.30 లక్షల మార్క్ దాటిన కొత్త కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.31 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 1,31,968 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 780 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 61,89 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,60,542 కాగా.. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 9,79,608 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,19,13,29 కి చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,67,642 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 91.67 శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 7.04 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.29 శాతానికి మరణాల రేటు తగ్గింది.

Related posts