telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

కేరళలో కీలక సన్నివేశాలు.. స‌రిలేరు నీకెవ్వ‌రు టీం …

హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సూపర్ స్టార్ మ‌హేష్ బాబు చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం విడుద‌ల కానున్న ఈ చిత్రంలో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తుంది. విజ‌యశాంతి ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుంది.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కొద్ది రోజులుగా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం తాజాగా కేర‌ళ‌కి ప‌య‌న‌మైంది. అక్క‌డ చిత్రానికి సంబంధించి కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌లైన స‌రిలేరు నీకెవ్వ‌రు స‌రికొత్త రికార్డ్ సృష్టించిన సంగ‌తి తెలిసిందే. చిత్ర పోస్ట‌ర్‌కి ఎక్కువ లైక్స్ రాగా, ఇదే హ‌య్యెస్ట్ అని అంటున్నారు.

Related posts