కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో జగన్ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..కరోనా వంటి విపత్కర సమయంలో ప్రజల్లో ప్రభుత్వం భరోసా నింపాల్సి ఉంటుందని, ఇటువంటి పనులు చేయకుండా సీఎం జగన్ తన ఇంటికే పరిమితమవుతున్నారని చెప్పారు.
మరోవైపు కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిత్యం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని కళా వెంకట్రావు చెప్పుకొచ్చారు. జగన్కు న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నప్పటికీ ఆయన తీరు మారలేదని కళా వెంకట్రావు చెప్పారు. రాష్ట్రంలో కరోనా కట్టడి కంటే రాజకీయాలకే జగన్ ప్రాధాన్యతనిస్తున్నారని ఆయన చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సీఎం అందుబాటులో ఉండట్లేదని ఆయన విమర్శించారు.