telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దేనిని కూల్చాలన్నా జగన్ చేతిలోనే రిమోట్‌: యనమల

Yanamala tdp

వైసీపీ సర్కార్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దేనిని కూల్చాలన్నా రిమోట్‌ కంట్రోల్ ముఖ్యమంత్రి జగన్ చేతిలోనే ఉందని ఆయన అన్నారు. వ్యవస్థలను వైసీపీ దగా చేస్తూ మోసం చేసిందని ఆయన ఆరోపించారు.

న్యాయమూర్తి రామకృష్ణపై జరిగిన దాడిని తాము ఖండిస్తున్నామని యనమల రామకృష్ణుడు తెలిపారు. జడ్జిలకే భద్రత లేకపోతే ఇక సామాన్యుడికి రక్షణ ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నిరుద్యోగుల కోసమే శాండ్‌ కార్పొరేషన్ ఏర్పాటుకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని ఆయన ఆరోపించారు.

Related posts