పార్క్ హయత్ హోటల్లో డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా చిరు తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించి ఎలాంటి సాయం కావలన్నా చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని అన్నారు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన చిరు… “ఇండస్ట్రీకి సంబంధించి అన్ని వివరాలని డైరీలో పొందుపరచినట్టు తెలిపారు. ఈ ఏడాది రెండు లేదా మూడు ఈవెంట్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. నాగార్జున, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, ప్రభాస్లతో పాటు ఇతర యువ కథానాయకులని కూడా ఈ ఈవెంట్లో భాగం కావాలని కోరతాను. నేను అడిగితే వారు తప్పక ఒప్పుకుంటారు. చిత్ర పరిశ్రమకి సంబంధించిన సహాయ సహకారాలు అందించేందుకు కేసీఆర్ సిద్దంగా ఉన్నారు కాబట్టి మనం ఇంక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో కలిసి చర్చించుకుందాం . ఆయనకి వివరిద్ధాం” అని ఈ కార్యక్రమంలో చిరు స్పష్టం చేశారు.
ఎక్కడ స్కామ్ ఉంటే అక్కడ నిలుస్తావు.. పీవీపీపై బండ్ల గణేశ్ విమర్శలు