ప్రపంచ కప్ లో భాగంగా సౌతాంప్టన్లోని ది రోజ్బౌల్ మైదానంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న టోర్నీ 15వ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు సౌతాఫ్రికాను బ్యాటింగ్కు ఆహ్వానించగా.. ఆ జట్టు 7.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది.
హషీం ఆమ్లా (7 బంతుల్లో 6 పరుగులు, 1 ఫోర్), మార్క్రం (10 బంతుల్లో 5 పరుగులు, 1 ఫోర్)లు సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటయ్యారు. అనంతరం క్వింటన్ డి కాక్ (21 బంతుల్లో 17 పరుగులు, 1 ఫోర్), కెప్టెన్ డుప్లెసిస్ (7 బంతుల్లో 0 పరుగులు)లు క్రీజులో కొంత సేపు కొనసాగారు. కాగా వెస్టిండీస్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్ 2 వికెట్లు తీశాడు. అయితే కొంత సమయం గడిచాక వర్షం పడడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వర్షం ఒక దశలో తగ్గినప్పటికీ మళ్లీ వెంటనే రావడం.. ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ను నిర్వహించే అవకాశం లేక అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో సౌతాఫ్రికా, వెస్టిండీస్లు చెరొక పాయింట్ను పొందాయి.
నాగ చైతన్యలో మేనమామ పోలికలు… ఇవే అంటున్న వెంకటేష్