భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రిషబ్ పంత్కు మిడిల్ ఫింగర్ చూపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే అసలు ఏం జరిగిందంటే… ప్రస్తుతం బయో బబుల్లో ఉంటూ మ్యాచ్లు ఆడుతున్న క్రికెటర్లు.. నిబంధనల మేరకు తరుచూ కోవిడ్ పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తొలి వన్డే అనంతరం టెస్ట్ చేయించుకున్న రోహిత్ శర్మను.. పంత్ సరాదాగా పలకరించే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా కొంత ఫన్ క్రియేట్ చేయాలని వీడియో కూడా తీశాడు. కానీ కరోనా టెస్ట్తో తీవ్ర చికాకుకు గురైన హిట్ మ్యాన్ తన ఫ్రస్టేషన్ను పంత్పై చూపించాడు. రోహిత్ శర్మ తన మిడిల్ ఫింగర్ ను పంత్ కు చూపించాడు. ఇక ఈ వీడియోను తన ఇన్స్టా స్టోరీలో పంచుకున్న పంత్.. కరోనాతో క్రికెటర్లు ఎలా ఇబ్బంది పడుతున్నారో తెలియజేసే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో పంత్కు అవకాశం దక్కలేదు. అతని స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి అదరగొట్టాడు.
previous post
ప్రజలు తిరస్కరించినా.. చంద్రబాబుకు బుద్ధి రాలేదు: రోజా