telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజలు తిరస్కరించినా.. చంద్రబాబుకు బుద్ధి రాలేదు: రోజా

roja ycp mla

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా విరుచుకుపడ్డారు. విజయవాడలో తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలు తిరస్కరించినా, చంద్రబాబుకు బుద్ధి రాలేదనిమండిపడ్డారు. మహానాడులో మహానేత ఎన్టీఆర్ చిత్రపటానికి దండేసిన చంద్రబాబు, ఆ వెంటనే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని తీర్మానం చేయడం సిగ్గుచేటని రోజా విమర్శించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారిలో నలుగురిని మంత్రులుగా చేసిన వేళ, ప్రజాస్వామ్యం ఏమైందని ఆమె ప్రశ్నించారు.

మహిళలు, రైతులకు సీఎం జగన్ చేసినంత మేలు ఎవరూ చేయలేదని అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్కుండానే రూ. 10 వేల కోట్లను వారి ఖాతాల్లోకి జమ చేశారని గుర్తు చేశారు. పలు సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఆమె వెల్లడించారు. చంద్రబాబు 33 పథకాలు ప్రవేశ పెట్టానని ప్రగల్బాలు పలుకుతున్నారని రోజా దుయ్యబట్టారు. తన మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేస్తూ జగన్ ముందుకు సాగుతుంటే, టీడీపీ మాత్రం వారి వెబ్ సైట్ నుంచి మేనిఫెస్టోను తీసేసిందని ఎద్దేవా చేశారు.

Related posts