కమీషన్ తగ్గించారని స్విగ్గీ డెలివరీ బాయ్స్ హైదరాబాద్ లో ఆందోళన చేపట్టారు. గచ్చిబోలి స్విగ్గీ ఆఫీస్ ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. స్విగ్గీ తమకు బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్త్గున్నారు. యాజమాన్యం ఇచ్చే కమిషన్ తమకు పెట్రోలుకు కూడా సరిపోవడం లేదని వారు వాపోతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి తమ ఆందోళన ఉధృతం చేశారు.
తమకున్న రోజువారీ వచ్చే వేతనం కంటే ఒక్కోక్క డెలివరీపై దాదాపు రూ. 35 నుంచి 25 తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నిన్నటి నుంచి నగరంలో స్విగ్గీ డెలివరీ బాయ్స్ తమ పనులను నిలిపివేసి ఆందోళన బాటపట్టారు. మొదట ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా తమకు కమిషన్ ఇవ్వాలని, బ్యాచ్ ఆర్డర్కు రూ. 20 ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈవోని మంత్రి వెనకేసుకొస్తున్నారు: దేవినేని ఉమ