telugu navyamedia
సినిమా వార్తలు

ఈవారం ఏపీలో “లక్ష్మీస్ ఎన్టీఆర్”

Lakshmi's NTR in AP
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో స్వర్గీయ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రం తెలంగాణాలో విడుదలై మంచి హిట్ ను అందుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ చిత్రం విడుదల ఆగిపోయింది. అయితే ఈ వారంలోనే ఆంధ్రప్రదేశ్ లో “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రం విడుదలవుతుందని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ చేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రం గత నెల 29న విడుదలైన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో ఎన్నికలు రేపటితో ముగియనుండటంతో, ఆ వెంటనే సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు వర్మ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు ఈ చిత్రాన్ని ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ యూ దుర్గా ప్రసాదరావులతో కూడిన ధర్మాసనం తిలకించి తీర్పును ఇవ్వనుంది.

Related posts