telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“క్రాక్” షూటింగ్ మళ్ళీ మొదలైంది…!

Crack

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “క్రాక్”. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలిసింది. సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా నటిస్తుండగా, ఆయన సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్‌ ప్రారంభమైంది. దీనితో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని యూనిట్ తెలిపింది. త్వరలోనే పాటలు, ట్రైలర్ కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్ మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని నేర ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Related posts