ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా జీడీపీ పతనం కావడం పట్ల రాహుల్ స్పందించారు. మోదీ సృష్టించిన విపత్తుల వల్ల దేశం సర్వనాశనం అవుతోందని మండిపడ్డారు. మోదీ విపత్తులను ట్విట్టర్ లో షేర్ చేశారు.
సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తతలు, రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలను చెల్లించకపోవడం, రికార్డు స్థాయిలో జీడీపీ 23.9 శాతం పతనం కావడం.45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిన నిరుద్యోగ సమస్య అంటూ ట్విట్టర్ లోపేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కూడా నిన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనా అనేది ప్రకృతి వైపరీత్యమని అన్నారు. దాన్ని మీరు మానవతప్పిదంగా మలిచేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.