బుల్లితెర స్టార్ షో బిగ్ బాస్ ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ కంప్లైంట్స్ రాని వ్యక్తి పునర్నవి. మొదటి వారంలో నాగార్జున కూడా పునర్నవిని చపాతీ విషయంలో అభినందించాడు. రెండవ వారానికి వచ్చేసరికి పునర్నవి అసలు రంగు బయటపడింది. అప్పటి వరకు ఎవరిని పల్లెత్తి మాట కూడా అనని పునర్నవి అమ్మలక్కలు అనే ఒక్క మాటతో తన నిజ స్వరూపం బయటపెట్టింది.దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్క్ అయ్యారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున బిగ్ బాస్ లో హీరో ఎవరు, విలన్ ఎవరో చెప్పమని అన్నపుడు ఆమె మహేష్ ని విలన్ గా చూపించింది. అయితే దానికి ఆమె చెప్పిన కారణమే సరిగ్గా లేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.పునర్నవి మహేష్ ని ఇతరులను రెచ్చగొడుతున్నాడని, మొదటి నుండి అతని ప్రవర్తన అలాగే ఉందని, అపుడు గట్టిగా అరిచేవాడని, ఇప్పుడు సైలెంట్ గా రెచ్చగొడుతున్నాడని చెప్పింది.
బిగ్ బాస్ దీపం టాస్క్ ఇచ్చినపుడు చప్పట్లు కొట్టి రెచ్చగొట్టిన వాళ్ళలో పునర్నవి ఒకరు. అలాగే వరుణ్ జైలుకెళ్ళినపుడు హిమజ ఆ విషయం డిస్కస్ చేస్తుంటే మధ్యలో వచ్చి పునర్నవి వాదించింది. హిమజ దానికి సమాధానం ఇస్తుంటే వెళ్ళి పడుకో అనడం హిమజ ని చాలా బాధించింది. పైన చెప్పిన విషయాలతో ఆమెకు డైరెక్టుగా సంబంధం లేకపోయినప్పటికీ ఆమె చేసిన వాదన ఇతరులను రెచ్చగొట్టే విధంగానే ఉంది.దీంతో సోషల్ మీడియాలో పునర్నవిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మహేష్ కాదు ముందు నువ్వు రెచ్చగొట్టడం మానుకో అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి పునర్నవి ఇక నుండైనా ఇతరులని రెచ్చగొట్టడం ఆపుతుందా లేదా చూడాలి.