telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రను మండల్ మరోపాట… సోషల్ మీడియాలో వైరల్

Ranu

ఓవర్ నైట్‌ స్టార్ సింగర్‌గా ఎదిగిన రను మండల్ మరో పాట నెట్టింట్లో సందడి చేస్తోంది. తాజాగా బాలీవుడ్ సింగర్ హిమేష్ రేష్మియా, రను పాడిన మరో పాట సోషల్ మీడియాలో షేర్ చేశారు. “ఆషికి మై తేరీ” అంటూ మొదలైన ఈ పాటను కూడా రను అద్భుతంగా పాడింది. రను స్వీట్ వాయిస్‌కు మరోసాని నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. అంతకుముందు హిమేష్ రేష్మియా, రను మండల్ పాడిన “తేరి మేరి” సాంగ్ కూడా సోషల్ మీడియాను ఓ ఊపు ఊపింది. ఒక్క పాటతో సూపర్ సెలిబ్రెటీ స్థాయినందుకున్న రనుమండల్ ‌దశ తిరిగిపోయింది. రైల్వే స్టేషన్ వద్ద భిక్షాటన చేసుకునే మండల్ తన పాటతో అందర్నీ ఆకట్టుకునేది. “ఏక్ ప్యార్ క నగ్మా హై” అని రను పాడిన పాటను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు గాయకుడైన హిమేష్ రేష్మియా తాను కంపోజ్ చేస్తున్న “తేరీ మేరీ కహాని” సినిమాలో గాయనిగా ఆఫర్ ఇచ్చాడు. ఆమెతో కలిసి డ్యూయట్ కూడా పాడాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Related posts