telugu navyamedia
సినిమా వార్తలు

“ఓ బేబీ”ని వీక్షించిన తెలంగాణ గవర్నర్

Oh-Baby

దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కించారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేశారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటించారు. 70 ఏళ్ల వృద్దురాలు తిరిగి య‌వ్వ‌నంలోకి వ‌స్తే ఎలాంటి పరిణామాలు జరిగాయి అన్న నేప‌థ్యంతో ఈ చిత్రం తెర‌కెక్కింది. అయితే కొద్ది సేప‌టి క్రితం తెలంగాణ గ‌వ‌ర్నర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ ఆయ‌న ఫ్యామిలీతో క‌లిసి .. స‌మంత న‌టించిన ఓ బేబి చిత్రం స్పెష‌ల్ స్క్రీనింగ్ చూశారు.చిత్ర యూనిట్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. స్పెష‌ల్ స్క్రీనింగ్‌కి గ‌వ‌ర్న‌ర్‌తో పాటు నందిని రెడ్డి, చిత్ర బృందానికి సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రయ్యారు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా అంచ‌నాల‌ను అందుకుంటూ ఘ‌న విజ‌యంగా నిలిచింది. త‌ను పోషించిన పాత్ర‌లో స‌మంత‌ని త‌ప్ప మ‌రొకరిని ఊహించుకోలేనంత గొప్పగా సమంత అద్భుతాభినయాన్ని ప్రదర్శించింది. వృద్ధురాలైన బేబీ పాత్రలో లక్ష్మి పరకాయ ప్రవేశం చేసింది. రావు రమేష్, రాజేంద్రప్రసాద్ తమ పాత్రలకు పరిపూర్ణంగా న్యాయం చేశారు. ప్రథమార్థంలో సమంత, రాజేంద్రప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాల్లో చక్కటి వినోదం పండింది. పతాకఘట్టాల్లో సమంత, రావురమేష్ మధ్య సీన్స్ హార్ట్‌ టచింగ్‌గా సాగాయి. తెలుగు రాష్ట్రాల‌లోనే కాక విదేశాల‌లోను ఈ చిత్రానికి మంచి వ‌సూళ్ళు వ‌స్తున్నాయి. ఓ బేబి చిత్రం హిందీలో రీమేక్ కానుంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. చిత్రంలో రానా ప్ర‌ధాన పాత్ర పోషించ‌నుండ‌గా, స‌మంత పాత్ర‌లో కంగ‌నా లేదా అలియా న‌టిస్తారని టాక్.

Related posts