తమిళ స్టార్ హీరో విశాల్ హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అనీశా రెడ్డితో నిశ్చితార్ధం జరుపుకున్న సంగతి తెలిసిందే. మార్చి 10న వీరి ఎంగేజ్మెంట్ జరగగా, అక్టోబర్లో పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటీవల వీరి పెళ్లి ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతుంది. అనీషా తమ నిశ్చితార్థంకి సంబంధించిన ఫోటోలతో పాటు విశాల్తో దిగిన ఫోటోలని పర్సనల్ ఎకౌంట్ నుండి డిలీట్ చేయడం వలన పుకార్లకి బలం చేకూరింది. అయితే అనీశా తాజాగా తనకి కాబోయే భర్త విశాల్కి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ… “నువ్వు స్టార్గా మెరవడానికి పుట్టావు. జీవితంలోకి మంచి రోజులు రానున్నాయి. ఆ నమ్మకం నాకుంది. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను” అని అనీశా పేర్కొంది. అనీశా పోస్ట్తో అభిమానులలో ఉన్న అనుమానాలు కూడా తొలగిపోయాయి. ప్రస్తుతం విశాల్ “యాక్షన్” చిత్రంలో నటిస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మిస్కిన్ దర్శకత్వంలో “తుప్పరవాలన్-2”, “ఇరుంబు థిరాయ్-2” చిత్రాలు చేయనున్నాడు విశాల్
previous post
మామగారు బిగ్ బాస్ హోస్ట్ చేయమన్నప్పుడు భయపడ్డాను : సమంత