ప్రకాశం ఎస్పీ కోయ ప్రవీణ్ను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో ఒంగోలు ఎస్పీగా సిద్ధార్థ కౌశల్ని నేరుగా ఈసీ నియమించింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికలు మరికొద్ది గంటల్లో జరగనున్న నేపథ్యంలో సీఈసీ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్తో పాటు మంగళగిరి, తాడేపల్లి సీఐలపై బదిలీ వేటు వేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అధికార పార్టీకి కొందరు అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ గత నెల 25న వైసిపిన నేతలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇంటెలిజెన్స్ డీజీ, కడప, శ్రీకాకుళం ఎస్పీలను ఈసీ బదిలీ చేసింది.