మహేష్ బాబు ఏఎంబీ మాల్ కు హైదరాబాద్ లోని చాలామంది సెలెబ్రిటీలు సినిమా చూడడానికి వస్తుంటారు. మహేష్ బాబు ఫ్యామిలీ కూడా ఇక్కడ సినిమాలు చూడడానికి వస్తుంటారు. మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కలిసి సందడి చేశారు. చిరు తనయ సుస్మిత భర్త బర్త్డే సందర్భంగా మెగా, అల్లు ఫ్యామిలీ అంతా ఒక్క చోట చేరారు. మహేష్ బాబు ఏఎంబీ థియేటర్ కి వెళ్లి సినిమా చూసారు. గ్యాప్ సమయంలో వీరందరు కలిసి ఫోటో దిగారు. ఇందులో అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహా రెడ్డి, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, బన్నీ సోదరుడు అల్లు బాబి, మెగా హీరోయిన్ నిహారికి, చిరు కుమార్తెలు శ్రీజ, సుస్మిత, చిరు చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్తో పాటు పలువురు కుటుంబ సభ్యులు ఈ గ్యాంగ్లో ఉన్నారు. అయితే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా కారణంగా హైదరాబాద్లో లేకపోవడంతో యూత్ గ్యాంగ్తో కలవలేకపోయారు. ప్రస్తుతం వరుణ్ తేజ్, అల్లు అర్జున్, సాయిధరమ్ వేరు వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికి చిలౌట్ పార్టీకి హాజరు కావడం విశేషం.
previous post
గాంధీజీపై కంగనా షాకింగ్ కామెంట్స్