తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా లో భాగంగా ఆదివారం 129 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వార్డులవారీగా ఫొటో ఓటరు జాబితాను విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.
ఈ నెల 10న ముసాయిదా విడుదల చేసిన విషయం తెలిసిందే. ముందుగా ఈ నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు చేసినప్పటికీ.. నూతన చట్టం అమల్లోకి తెచ్చిన తర్వాతనే ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో వారంరోజుల తర్వాత షెడ్యూల్ జారీచేసే అవకాశాలున్నాయి. మరోవైపు మున్సిపాలిటీల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను ఇప్పటికే మొదలుపెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలవారీగా ఓటరు జాబితాను సిద్ధంచేశారు.