టీమిండియా కోచ్ నియామకం పై గత రెండు నెలలుగా వెలువడుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. అందరూ అనుకున్నట్లే టీమిండియా చీఫ్ కోచ్ గా మళ్లీ రవిశాస్త్రినే ఎంపికచేస్తూ కపిల్ దేవ్ సారథ్యంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. దీంతో రెండు నెలల సస్పెన్స్ కు తెరపడింది. 2021 వరకు శాస్త్రి ఈ పదవిలో కొనసాగనున్నట్ల కపిల్ దేవ్ పేర్కొన్నాడు.
శుక్రవారం ఉదయం నుండి చీఫ్ కోచ్ పదవి కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల ఇంటర్వ్యూలు కొనసాగాయి. చీఫ్ కోచ్ ఎంపిక ప్రక్రియను చేపడుతున్న సీఏసీ సభ్యులైన కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామిలు చివరగా పోటీలో నిలిచిన ఆరుగురిని ఇంటర్వ్వూ చేశారు. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ రవిశాస్త్రి నే మళ్లీ హెడ్ కోచ్ కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నట్లు కమిటీ సభ్యులు ప్రకటించారు.
టీఆర్ఎస్ అవినీతిపై బీజేపీ మాట్లాడటం సంతోషకరం: జీవన్ రెడ్డి