telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

లక్ష లేని వ్యక్తికి లక్ష కోట్లు ఎలా వచ్చాయి : విజయ శాంతి

vijayashanthi

ఈ మధ్యే విజయ శాంతి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన విజయ శాంతి మాట్లాడుతూ… జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది..ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు చివరి వరకు పోరాడాలి.. సాధించాలి అని తెలిపింది. 1998 నుండి నేను తెలంగాణ ఇష్యూ నే తీసుకున్నాను..ఆ రోజు కేసీఆర్ లేరు. బీజేపీ లో ఉండి తెలంగాణ కోసం పోరాడాను..తెలంగాణ ని టీడీపీ వ్యతిరేకించింది. తప్పని పరిస్థితి లో బీజేపీ ని వీడాను.. ఆ సమయంలో ఏడ్చాను. తెలంగాణ ఉద్యమం కోసమే బీజేపీ ని వదిలాను.. సొంత పార్టీ తల్లి తెలంగాణ పార్టీ పెట్టాను. ఆ తర్వాత దొరగారు ఎంటర్ అయ్యారు.. మంత్రి పదవి ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమం లోకి వచ్చాడు.. నేను నా ముసల్ది మాత్రమె ఉన్నాము.. నా కుటుంబం ఎవరు రారు అని అన్నాడు. నేను దూకుడుగా పోతుంటే దురుద్దేశ్యం తో కేసీఆర్ నన్ను తమ పార్టీ లో కలుపుకోవాలని చూసాడు నరేంద్ర గారిని పంపించాడు… ఒక 25 సార్లు నా ఇంటికి వచ్చారు. చివరికి ఒప్పుకొని కేసీఆర్ ని కలిశాను.. మనము కలిసి పని చేద్దాం అని అన్నాడు.. మీరు బాగా కష్ట పడుతున్నారు అని అన్నాడు నాకు నవ్వొచ్చింది అని విజయం శాంతి తెలిపాడు. నేను ఆ పార్టీ ని మెర్జ్ చేయడానికి ఒప్పుకోలేదు.. కానీ నా మీద ఒత్తిడి తెచ్చారు.. నా మీద ద్రోహి అనే ముద్ర వేసే ప్రయత్నం చేశారు. చివరికి మెర్జ్ చేయక తప్పలేదు. అయితే నా కన్నా గొప్ప నటుడు కేసీఆర్ అని తెలిపిన ఆమె నన్ను కేసీఆర్ పదో చెల్లె అన్నాడు అని చెప్పింది. రాఖీ పౌర్ణమికి నా దగ్గరికి వస్తా అన్నాడు .. లేట్ అయితే సంతోష్ కి పోన్ చేశాను. మీకు ఇవ్వడానికి 10 వేల కోసం ఆగాడు అని చెప్పాడు. ఆ రోజు లక్ష లేని వ్యక్తి .. ఈ రోజు లక్ష కోట్లు ఎలా వచ్చాయి అని ప్రశ్నించింది.

Related posts