telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాత్రిపూట రసాయనాలను వదిలేస్తున్నారు: రేవంత్ రెడ్డి

Revanth-Reddy mp

హైదరాబాద్ శివారు ప్రాంతంలో పర్యావరణం నాశనమైపోతోందని కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కొన్ని పరిశ్రమలు రాత్రిపూట ప్రమాదకరమైన రసాయనాలను వదిలేస్తున్నాయని ట్విట్టర్ లో ఆరోపించారు. ఈ విషం కారణంగా పర్యావరణం నాశనమైపోతోందని కండ్లకోయ వద్ద ఈ రసాయనాల కారణంగా అక్కడి నీటిని తాగే జంతువులు కూడా ముత్యువాత పడుతున్నాయని తెలిపారు.

గత ఏడాదికాలంగా ఈ వ్యవహారం యాదేచ్చగా కొనసాగుతుందని చెప్పారు. ఈ విషయంలో తాను పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దీన్ని అధికారిక ఫిర్యాదుగా భావించి అధికారులు చర్యలు తీసుకోండన్నారు. మేడ్చల్ కలెక్టర్, తెలంగాణ సీఎం కార్యాలయం ట్విట్టర్ హ్యాండిల్ లను ట్యాగ్ చేశారు. అలాగే ఈ రోజు ఓ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని తన ట్వీట్ కు జతచేశారు.

Related posts