కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాపారస్థులు సెల్ఫ్ డాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ తండ్రి తన కుమార్తె పెళ్లిని ఘనంగా చేసి, 43 మందికి వైరస్ సోకడానికి కారణమయ్యాడు . దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. కేరళలోని కాసర్గఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి నిర్వహించిన ఈ పెళ్లి వేడుకకు హాజరైన వారిలో ఏకంగా 43 మంది కొవిడ్ బారినపడ్డారు. స్పందించిన అధికారులు అందరికీ పరీక్షలు నిర్వహించగా అందులో వధూవరులు సహా మొత్తం 43 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వైద్యాధికారులు అందరినీ క్వారంటైన్కు తరలించారు. నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి చేసిన వధువు తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.