telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

కేయూలో విద్యార్థుల ఆందోళన.. స్వల్ప లాఠీ చార్జ్‌!

kakatiya university

వరంగల్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటిలో డిగ్రీ సిలబస్‌ ఇంకా పూర్తికాకముందే సెమిస్టర్‌ పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతందని ఏబీవీపీ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్‌ చేయడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

షెడ్యూల్‌ క్లాసులు పూర్తిగా జరగకముందే పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు.  యూనివర్సిటీ రిజిస్టర్‌ చాంబర్‌ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు.

Related posts