telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విపక్ష నేతలకు కరోనా సోకితే కేసీఆర్ దే బాధ్యత: భట్టి

Batti vikramarka

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విరుచుకుపడ్డారు. కేసీఆర్‌చాలా పెద్ద కుట్రదారుడని దుయ్యబట్టారు. విపక్ష నేతలకు కరోనా అంటించాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే వారికి కరోనా రావాలని శపించిన కేసీఆర్.. తనను విమర్శించిన వారిని అరెస్ట్ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నేతలకు కరోనా సోకితే అందుకు కేసీఆర్, డీజీపీలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

అరెస్టు చేసేముందు పోలీసులు వాహనాలను శానిటైజ్ చేయాలని అన్నారు. వాటి ద్వారా తమ నాయకులకు కరోనా సోకే ప్రమాదం ఉందన్నారు. అలా జరిగితే కనుక కేసీఆర్, డీజీపీలే అందుకు బాధ్యులు అవుతారని హెచ్చరించారు. అంతేకాదు, కాంగ్రెస్ కార్యకర్తలు గుడ్డిగా పోలీసు వాహనాలను ఎక్కొద్దని సూచించారు. రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఢిల్లీ డైరెక్షన్‌లో పనిచేస్తున్నారని భట్టి విమర్శించారు.

Related posts