వరంగల్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేటి నుంచి అమల్లోకి రావడంతో ఈ నెల 29న నిర్వహించాల్సిన టీఆర్ఎస్ విజయ గర్జన సభను ఆ పార్టీ వాయిదా పడింది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకొంది TRS. వాస్తవానికి ఈ నెల 15న ఈ సభను నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. ఆ తర్వాత ఈ సభను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో మళ్ళీ ఈ సభను టీఆర్ఎస్ వాయిదా వేసింది.
కాగా.. రాష్ట్రంలో ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించరాదని, హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రకటించిన నిబంధనలను పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు.
రాజకీయ పార్టీల సమావేశాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. స్థానిక అధికారుల నియోజకవర్గాలకు డిసెంబర్ 10న ఎమ్మెల్సీ ఎన్నికలు, డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుందని గోయల్ తెలిపారు.
ఆయుష్మాన్ భారత్ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు…