తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠంలోని 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామివారి సాధారణ సర్వదర్శనానికి 8 గంటల సమయంపడుతుంది. టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని దాదాపు 70 వేల మంది భక్తులు దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. 24,389 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.