నిన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్లహ్లాద్ జోషి అధ్యక్షతన పార్లమెంటు లైబ్రరీ భవన్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మీడియాకు వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనపై అసహనం వ్యక్తం చేశారని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా, తమ సీనియర్ నేత చిదంబరంకు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ నేతలు కోరారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న విజయసాయిరెడ్డి… తమ అధినేత జగన్ ఎంపీగా ఉన్న సమయంలో జైల్లో ఉన్నారని… ఆయనకు బెయిల్ రాకుండా కాంగ్రెస్ చేసిందని ఆరోపించారు. దీంతో ఇతర పార్టీల నేతలు ఆయనను అడ్డుకున్నారు.
జగన్ ప్రస్తావన ఇప్పుడెందుకని, ప్రస్తుతం ఆయన ఎంపీ కాదుకదా? అని ప్రశ్నించారు. చిదంబరం బెయిల్ తో జగన్ అంశాన్ని ఎందుకు ముడిపెడతారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. స్వీయ ప్రయోజనాల కోసం అఖిలపక్ష సమావేశాన్ని వాడుకోబోయి… విజయసాయిరెడ్డి అభాసుపాలయ్యారని కనకమేడల ఎద్దేవా చేశారు.
కేసీఆర్ను గద్దె దింపే బాధ్యత తీసుకున్నాం: రాజగోపాల్రెడ్డి