telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ పాలనలో అసలు సినిమా ముందుంది: రోజా

roja ycp mla

సీఎం జగన్ పాలనలో ఇంతవరకూ ట్రయిలర్ ను మాత్రమే చూస్తున్నామని, అసలైన సినిమా ముందుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో కిలో ప్లాస్టిక్ తెచ్చిస్తే, కిలో బియ్యం ఇచ్చేలా వినూత్న పథకాన్ని రోజా ప్రారంభించారు. ఆదివారం నాడు రోజా పుట్టినరోజు కాగా, ప్లాస్టిక్ రహిత సమాజ సృష్టికి తనవంతు చర్యగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించానని అన్నారు.

ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలిసేందుకు 400 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. హానికర ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాల్సివుందని ఆమె అన్నారు. కాగా, ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కూడా పాల్గొని, దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.

Related posts