నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి తమిళ ఫిల్మ్ స్టార్ రజనీకాంత్ హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలంటూ తలైవాను ఆహ్వానించారు. అయితే ఆ ఆహ్వానాన్ని రజనీకాంత్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఈరోజు రజినీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోందని అన్నారు. తమిళనాడులో మోదీ ప్రభంజనం లేదన్నారు. మోదీది అసాధారణ విజయమని, ఆయన చరిష్మా ఉన్న నేత అని, భారత్లో నెహ్రూ, రాజీవ్ తర్వాత మోదీకి అంతటి చరిష్మా ఉందని రజనీ అన్నారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లనున్నట్లు చెప్పారు. రాహుల్ గాంధీకి సానుభూతి తెలిపారు. పార్టీ చీఫ్ పదవికి రాహుల్ రాజీనామా చేయకూడదని రజనీ అభిప్రాయపడ్డారు. సమర్థుడినన్న విషయాన్ని ఆయన ప్రూవ్ చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం బలంగా ఉండాలని రజనీ అభిప్రాయపడ్డారు. మరో తమిళ ఫిల్మ్ స్టార్ కమల్హాసన్కు కూడా ఆహ్వానం అందింది. అయితే మక్కల్ నీధి మయం పార్టీ అధినేత కమల్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు అవుతారా లేదా అన్న అంశం గురించి తెలియాల్సిఉంది.
తమ గదికి రాలేదని సినిమాల నుంచి తొలగించిన నీచులు… రిచా చద్దా సంచలన వ్యాఖ్యలు