telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పసుపులేటి రామారావు కన్నుమూత

Pasupuleti

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పసుపులేటి రామారావు అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. బుధ‌వారం ఉదయం ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. యూరిన్ ఇన్ఫెక్షన్‌కు గురైన ఆయన్ని ఆదివారం వనస్థలిపురంలోని ప్రైవేటు హాస్పిట‌ల్లో చేర్పించారు. నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా సినీ జ‌ర్న‌లిస్ట్‌గా ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి సంస్థ నుంచి వెలువడే వార‌ప‌త్రిక జ్యోతి చిత్ర స‌హా శివరంజని, సంతోషం తదితర సినిమా పత్రికల్లో పనిచేశారు. అనేక సినిమాలకు పీఆర్వోగా కూడా వ్యవహరించారు..సావిత్రి, చిరంజీవి, టి.కృష్ణ స‌హా ప‌లువురు దిగ్గ‌జాల‌పై ఆయ‌న పుస్త‌కాల‌ను ర‌చించారు. రామారావుకి భార్య‌, కుమారుడు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఎంతో ఆప్తుడు అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌, సినీ పీఆర్ఓ ప‌సుపులేటి రామారావు దాదాపు 5 ద‌శాబ్ధాలపాటు సినీ జ‌ర్న‌లిస్ట్‌గా ప‌ని చేసిన ఆయ‌న ఎన్నో పుస్త‌కాలు కూడా ర‌చించారు. మొద‌ట విశాలాంధ్ర ప‌త్రిక‌కి జ‌ర్న‌లిస్ట్‌గా ప‌ని చేసిన పసుపులేటి ప్ర‌స్తుతం సంతోషం ప‌త్రిక‌కి జ‌ర్న‌లిస్ట్‌గా ప‌ని చేస్తున్నారు. ఎన్నో సినిమాల‌కి పీఆర్ఓగా కూడా ప‌నిచేసిన అనుభ‌వం ఆయ‌న‌ది. ప‌సుపులేటి రామారావు స్వ‌స్థ‌లం ఏలూరు కాగా, ఆయ‌న సీనియ‌ర్ ఎన్టీఆర్ నుండి బాల‌కృష్ణ‌, చంద్ర‌మోహ‌న్‌, నాగార్జున వెంక‌టేష్‌, చిరంజీవి ఇలా చాలా మంది హీరోల‌ని ఇంట‌ర్వ్యూలు చేశారు. ఆయ‌న మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేశారు.

Related posts