కొన్నాళ్లు సినిమాల . ఇప్పటికే విష్ణు ‘మోసగాళ్లు’ అనే ఓ హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ చేస్తుండగా.. మనోజ్ ఇటీవలే ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమా ప్రకటించాడు. తాజాగా మోహన్బాబు శివరాత్రి సందర్భంగా భారీ అనౌన్స్మెంట్ చేశారు. మంచు విష్ణు హీరోగా 60 కోట్ల బడ్జెట్తో ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని కూడా ఆయన తెలిపారు. ప్రస్తుతం మంచు విష్ణు నిర్మాతగా, హీరోగా సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీగా ఉన్నారు. ‘భక్త కన్నప్ప’ సినిమా చేయాలని నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి పలువురు నిర్మాతలను సంప్రదించారు. పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వచ్చింది. విష్ణు, భరణి దగ్గరనుంచి ఈ స్క్రిప్ట్ కొన్నారని పలువురు రచయితలు తుదిమెరుగులు దిద్దుతున్నారని తెలునుంచి తాత్కాలిక విరామం తీసుకున్న మోహన్ బాబు వారసులు మంచు విష్ణు, మనోజ్ రీ ఎంట్రీలో భారీ చిత్రాలతో సర్ప్రైజ్ చేస్తున్నారుస్తోంది.