యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత నెపోటిజంపై వార్ నడుస్తోంది. తాజాగా సుశాంత్ స్నేహితురాలు, బాలీవుడ్ నటి రిచా చద్దా నెపోటిజం, ఇండస్ట్రీ చీకటి కోణాల గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. సుశాంత్తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న రిచా చద్దా కెరీర్ ఆరంభానికి ముందు ఇద్దరం కలిసి ముంబైలో థియేటర్ వర్క్షాప్స్కి వెళ్లేవాళ్లమని తెలిపింది. రిహార్సల్స్ చేయడానికి వెళ్లే ఆ సమయంలో సుశాంత్ తనను బండిమీద తీసుకెళ్లేవాడని, ఇండస్ట్రీ ఓ టాలెంటెడ్ యాక్టర్ ని కోల్పోయిందని పేర్కొంది. ఇక బాలీవుడ్లో రెండు రకాల మనుషులు మాత్రమే ఉన్నారని.. అది ఒకటి జాలి ఉన్నవారు.. రెండు జాలి లేనివారు అని పేర్కొంది. స్టార్ కిడ్స్లో మంచివాళ్ళు కొందరున్నారని, అయితే కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో పాతుకుపోయి జాలిలేని కొందరు మాత్రం హీరోయిన్లను చాలా చులకనగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. సుశాంత్ మరణం తర్వాత నీతి వాక్యాలు చెబుతూ, ఆయన మరణం పట్ల సంతాపం తెలిపిన దర్శక నిర్మాతల్లో కొందరు నీచమైన వ్యక్తులున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు దర్శకనిర్మాతల్లో.. ఆఫర్ ఇచ్చాక కూడా హీరోయిన్లు తమ గదికి రాలేదని సినిమాల నుంచి తొలగించిన వాళ్ళు చాలామంది ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది రిచా చద్దా. దీంతో ఇండస్ట్రీలో నెపోటిజం, లైంగిక వేధింపుల అంశాలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి.
previous post
next post