కేటీఆర్ అతి తక్కువ సమయంలో ఐటీ మంత్రిగా తన ప్రతిభను ప్రపంచానికి చాటారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేటీఆర్ జన్మదినం సందర్బంగా సిరిసిల్ల అభివృద్ధిపై రూపొందించిన డాక్యుమెంటరీని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నేతలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని సైతం లెక్కచేయకుండా నిరంతరం కేటీఆర్ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని చెప్పుకొచ్చారు.
కేటీఆర్ జన్మదినం సందర్బంగా పేద ప్రజలకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దేవుడు, ప్రకృతి కూడా ఈ ప్రభుత్వానికి సహకరిస్తోందని మంత్రి తలసాని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పలువురు టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.
మోదీ విమర్శల పై స్పందించిన మాయావతి