కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో ఇరు పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇరు పార్టీల నేతల మధ్య కొనసాగుతున్న విమర్శల యుద్దం కర్ణాటక రాజకీయాలలో వేడిని పుట్టిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్యే కారణమని మాజీ ప్రధాని దేవేగౌడ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ కుటుంబంపై సిద్ధరామయ్య కక్ష కట్టారని ఆయన విమర్శించారు.
దేవేగౌడ వ్యాఖ్యలపై సిద్ధరామయ్య ఘాటుగా ప్రతిస్పందించారు.సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి దేవేగౌడ ఆయన కుమారులు కుమారస్వామి, రేవణ్ణలే కారణమని సిద్ధరామయ్య ఆరోపించారు. కానీ, ప్రబుత్వం కూలిపోవడానికి కారణం తానేనని ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవేగౌడ అసత్యాలు మాట్లాడారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి పేరును తానే ప్రతిపాదించానని చెప్పారు. జేడీఎస్ తో పొత్తుపై తమ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.